"కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ " అన్న శ్లోకము ఆండాళ్ యొక్క తిరునక్షత్రము గురించి తెలియజేస్తూ శ్రీమాన్ వేదాంత దేశికులవారు (ఈయన వైష్ణవ ఆచార్యులలో ప్రముఖులు) అల్లిక చేసిన స్తోత్రము. ఈ శ్లోకాన్ని రోజూ పూజా సమయంలో వైష్ణవ భక్తులు చదువుకోవచ్చును.
15, జనవరి 2025, బుధవారం
గోదాస్తుతి - కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ - Andal Goda Stuti Lyrics With Meanings
"కర్కటే పూర్వ ఫల్గుణ్యామ్ " అన్న శ్లోకము ఆండాళ్ యొక్క తిరునక్షత్రము గురించి తెలియజేస్తూ శ్రీమాన్ వేదాంత దేశికులవారు (ఈయన వైష్ణవ ఆచార్యులలో ప్రముఖులు) అల్లిక చేసిన స్తోత్రము. ఈ శ్లోకాన్ని రోజూ పూజా సమయంలో వైష్ణవ భక్తులు చదువుకోవచ్చును.
13, జనవరి 2025, సోమవారం
తిరుప్పావై - పాశురము 30 - "వఙ్గ క్కడల్ కడైంద మాధవనై" - Tiruppavai- Pasuram 30
తిరుప్పావై 30వ పాశురము గోదాదేవి తన గురించి చెప్పుకుంటున్నట్లు, మరియు ఈ వ్రత ఫలితమును తెలియజేస్తున్నట్లు గాను చెప్పబడినది.
ఆమె ఆ వ్రతాన్ని ఏవిధముగా, ఎవరిద్వారా తెలుసుకుని చేసినదీ, తను చేసినట్లే అందరమూ చేసి ఆమె లాగ ఆ భగవంతుని కటాక్షము పొంది ఆయన సన్నిధికి చేరుకోవచ్చుననీ నొక్కి చెబుతోంది ఇందులోని పంక్తుల ద్వారా.
తిరుప్పావై - పాశురము 30
12, జనవరి 2025, ఆదివారం
తిరుప్పావై - పాశురము 29 - "శిత్తుమ్ శిఱుకాలే వందు" - Tiruppavai- Pasuram 29
తిరుప్పావై 29వ పాశురము శ్రీకృష్ణుని పట్ల సమర్పణా భావనముతో అల్లబడినది.
అంతే కాకుండా మేము ఎల్లప్పటికీ నీతో పాటు ఉండి, జన్మ జన్మలకీ నీకు సేవలు చేస్తూ ఆనందించేట్లా అనుగ్రహించమని కూడా ఆయనను వేడుకుంటోంది.
తిరుప్పావై - పాశురము 29 - శిత్తుం శిఱుకాలే
11, జనవరి 2025, శనివారం
తిరుప్పావై తనియలు - గోదాదేవి స్తోత్రాలు అర్థములతో సహా - Tiruppavai Taniyans
తిరుప్పావై తనియలు అనేవి ధనుర్మాసములో గోదాదేవికి నమస్కరిస్తూ చదివే స్తోత్రాలు. వీటిని తిరుప్పావై పాశురములు చదివేముందు, మరల ఇంకోసారి చదివేశాక పఠిస్తారు. అంతేకాక ప్రతి రోజూ పూజలో కూడా వీటిని చదువుకోవచ్చును. పూజ ముగించే ముందు వీటిని చదువుకుంటాము. ఆ తరువాత మంగళహారతులు పట్టవచ్చును.
తనియ అంటే విడిగా ఉండేది. ఈ పదము తమిళ వ్యాకరణము లోనిది. "తని" మరియు "యాన్" అన్న రెండు పాదముల కలయిక.
"తని' అంటే ప్రత్యేకమైనది. అంటే ఇది ముఖ్య గ్రంథము లేదా కృతులలోనిది కాకుండా విడిగా సృష్టించబడినది.
దీనిని గ్రంథ కర్త అయినా రాసి ఉండవచ్చు లేదా తరువాతి వారు ఎవరైనా జత పరచి ఉండవచ్చును.
గ్రంథకర్త సృష్టించి ఉంటే అది భగవంతునికి కానీ, లేదా తన గురువులకు కాని సంబంధించినది ఉంటుంది.
వేరెవరైనా రాసి ఉంటే అది ఆ గ్రంథకర్తకి కృతజ్ఞతతో కానీ, లేదా భక్తి గౌరవములతో గాని సృష్టించినది అవుతుంది.
సాధారణముగా ఈ తనియల ద్వారా ఇవి ఎవరికైతే అర్పిస్తున్నామో వారి జీవన సంబంధీ మరియు విశేష యోగ్యతల గురించి చర్చించడము, పొగడటము జరుగుతుంది.
ఇప్పుడు తిరుప్పావై తనియల జోలికి వద్దాము. వీటిలో శ్రీకృష్ణుని మరియు గోదాదేవి చర్చలు జరిగాయి.
మొదటి తనియ "నీళాతుంగస్తన" అన్నది పరాశర భట్టర్ వారు రచించారు. ఇది సంస్కృత భాషలో ఉంది.
రెండవ, మూడవ తనియలు ఉయ్యకొండార్ స్వామి అన్నవారు రచించారు. ఇవి రెండూ కూడ తమిళ భాషలో ఉన్నాయి.
తిరుప్పావై తనియలు
ఒకటవ తనియ
రెండవ తనియ
మూడవ తనియ
ఆ విధముగా తను ధరించిన పుష్పమాలను అందించిన వారిలో ఆమెయే మొదటిది. అంతకు ముందు, తరువాత జరుగలేదు.
కీర్తనలు పాడి ఆ దేవుని వరించిన ఓ దేవీ ! వెంకటేశ్వర స్వామి ( ఇక్కడ శ్రీ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఒక్కరే అని భావించుకోవాలి) సన్నిధి నువ్వు ఏ విధముగా జేరుకున్నావో అదే విధంగా మమ్మల్ని కూడ ఆ స్వామి సన్నిధికి జేర్చుము తల్లీ !
తిరుప్పావై - పాశురము 28 - "కఱవైగళ్ పిన్ శెన్ఱు" - Tiruppavai- Paasuram 28
తిరుప్పావై 28వ పాశురములో గోదాదేవి తన అజ్ఞానతను (అంటే మన అందరి అజ్ఞానాన్ని) ఒప్పుకుంటూ, మేము బుద్ధి లేక అనేకమైన పిచ్చి పిచ్చి పనులు చెయ్యడం, మాట్లాడడము చేశాము. అందుకని నువ్వు కోపగించుకోక మమ్ములను క్షమించి, మాకు మేము అర్థించే పఱై అన్న బహుమానాన్ని ఇవ్వాలి. మాకు అన్ని కష్టాలు, దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదించి, నీ సన్నిధికి జేర్చుకోవాలి అని వేడుకుంటోంది.
తిరుప్పావై - 28వ పాశురము
10, జనవరి 2025, శుక్రవారం
తిరుప్పావై పాశురము 27 - కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా - Tiruppavai Pasuram 27
తిరుప్పావై - పాశురము 27
9, జనవరి 2025, గురువారం
తిరుప్పావై - పాశురము 26 - మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్ - Tiruppavai- Pasuram 26
తిరుప్పావై లోని 26వ పాశురము ద్వారా గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము చెయ్యడానికి కావలసిన తదితర వస్తువులను వివరించి చెప్తోంది. మేము ఈ వ్రతాన్ని సంతుష్టితో మంచిగా జరుపుకోడానికి నువ్వు ఇవన్నీ కూడ మాకు అందజెయ్యాలని శ్రీకృష్ణుని వేడుకుంటోంది.
తిరుప్పావై - పాశురము 26
8, జనవరి 2025, బుధవారం
తిరుప్పావై- పాశురము 25 - "ఒరుత్తి మగనాయ్ పిఱన్దు" - Tiruppavai- Pasuram 25
తిరుప్పావై 25వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లుల సౌభాగ్యము కలుగుట, మరియు అతను కంసుని వధించడము మున్నగు సాహస కార్యముల వర్ణన చేస్తూ అతనిని కీర్తించడము జరుగుతోంది. నీ కీర్తనలు చేసి పఱై పొందడానికి వచ్చామన్న సంగతి మరోసారి వక్కాణీంచి చెబుతోంది.
తిరుప్పావై - పాశురము 25
7, జనవరి 2025, మంగళవారం
తిరుప్పావై - పాశురము 24 - "అన్ఱి ఇవ్వులగం అళన్దాయ" - Tiruppavai- Pasuram 24
తిరుప్పావై - 24వ పాశురము
6, జనవరి 2025, సోమవారం
తిరుప్పావై - పాశురము 23 - మారిమలై ముళై న్గిల్ - Tiruppavai- Pasuram 23
తిరుప్పావై 23వ పాశురములో గోదాదేవి శ్రీకృష్ణుని యొక్క హావభావాలు (వొళ్ళు విరుచుకొనుట, నడక మున్నగు వయ్యారములు, హుందాతనం) ఒక సింహముతో పోలుస్తూ ఆయనను కీర్తిస్తూ, ఆ రాజసము ఉట్టిపడే కదలికలను మరల వీక్షించు మహాభాగ్యము మాకందరికీ ప్రసాదించమని వేడుకుంటోంది.
తిరుప్పావై - పాశురము 23 - మారిమలై
5, జనవరి 2025, ఆదివారం
తిరుప్పావై - పాశురము 22 - అంగణ్ మాణాలత్తర శర్ - Tiruppavai- Pasuram 22
తిరుప్పావై 22వ పాశురములో గోదాదేవి, తక్కినవారు తమ తమ స్త్రీత్త్వ సహజమైన అభిమానమును వదలి శ్రీకృష్ణుని జేరవచ్చినామని , తమపై ఆయన కారుణ్య కటాక్షములను ప్రసారించి తమను ఉద్ధరించమని వేడుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఆయన వైభవాన్ని, దివ్య తేజ్జస్సులను కూడ ప్రశంసించడము జరుగుతోంది.
తిరుప్పావై - 22వ పాశురము
4, జనవరి 2025, శనివారం
తిరుప్పావై - పాశురము 21 - ఏత్త క్కళమ్గళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప - Tiruppavai- Pasuram 21
తిరుప్పావై 21వ పాశురము ద్వారా గోదాదేవి శ్రీకృష్ణుని లేపుతూ అతని పశుసంపద, గుణసంపదలను పొగడము చేస్తోంది.
నీళాదేవి, తక్కిన బాలికలందరూ కూడా ఈ మేలుకొలుపులు పాడుతున్నారు. ఆయన యొక్క వైభవము, ఔదార్యము, అర్త రక్షణా స్వభావము, మొదలగు గుణ సంపదలను కీర్తిస్తున్నారు.
తిరుప్పావై - పాశురము 21
అర్థము :-
3, జనవరి 2025, శుక్రవారం
తిరుప్పావై - పాశురము 20 - ముప్పత్తు మూవరు అమరర్కు - Tiruppavai Pasuram 20
తిరుప్పావై 20వ పాశురములో ఆండాళ్ శ్రీకృష్ణ పరమాత్మకు మేలుకొలుపు పాడుతూ అతని సుగుణములను, ఔదార్య గుణములను కీర్తించడం చేస్తోంది. అతనితో పాటు నీళాదేవిని కూడా ఇంకోమారు వేడుకోవడము జరుగుతోంది. నీళ, కృష్ణుడు ఒకరొకరితో ముడిపడి ఉంటారు. ఎవరో ఒకరు లేవనిదే రెండో వారు లేవరు. అందుకని నప్పిన్న (నీళ) ఎలాగూ మెలకువ తెచ్చుకుంది కనుక తను త్వరగా లేచి, శ్రీకృష్ణుడిని తయారుచేయాలని కోరుకుంటోంది. అతని సేవ కోసమై ఒక విసనకర్ర, అద్దము ఇచ్చి, శ్రీకృష్ణుడిని తమకు వ్రతము చేయించడానికి వెంటనే పంపించమనీ వేడుకుంటోంది.
తిరుప్పావై - పాశురము 20
2, జనవరి 2025, గురువారం
తిరుప్పావై - పాశురము 19 - కుత్తు విళక్కెరియ - Tiruppavai - Paasuram 19
తిరుప్పావై 19వ పాశురము ద్వారా గోదాదేవి హాయిగా నిద్రపోతున్న నీళాకృష్ణులను నిద్రలేపుతూ, నీళాదేవికి తత్త్వముల సారము గురించి జ్ఞాపకము చెయ్యడం జరుగుతోంది.
నీళాదేవి గొప్ప భక్తురాలు, తత్త్వజ్ఞాని అయితే గోదాదేవి కూడ ఏమియు తక్కువ కాదు. శ్రీకృష్ణుడు ఒక్కరి సొత్తు కాదు. అందరికి చెందినవాడని తెలియజేసింది.
తిరుప్పావై - పాశురము 19
ఈ విధంగా తత్త్వజ్ఞానాన్ని నీళాదేవికి జ్ఞాపకము చేసింది గోదాదేవి. అప్పుడు నీళ మేలుకుంటుంది. తన పొరపాటును గుర్తించి, స్వామిని మేలుకొలుపుటలో వారికి సాయము చేస్తుంది.
1, జనవరి 2025, బుధవారం
తిరుప్పావై - పాశురము 18 - ఉన్డు మదగళిత్త నోడాద - Tiruppavai - Paasuram 18
తిరుప్పావై 18వ పాశురము లో గోదాదేవి నప్పిన్న పిరాట్టి (నీళాదేవి)ని నిద్రలేపడము తెలియజేస్తోంది.
నీళాదేవి నందగోపుని మేనకోడలు (చెల్లెలి కూతురు).
నందగోపుడు, యశోదలు లేచారు కాని శ్రీకృష్ణుడు ఇంకా లేవలేదు. అతను నీళాదేవి యొక్క భక్తి మరియు ప్రేమ అనే పాశముల ద్వారా బంధింపబడి ఉంటాడు కనుక ముందుగా నీళాదేవిని లేపడమే సరైన ఉపాయమని తలచి, గోదాదేవి తక్కిన బాలికలతో సహా నీళాదేవిని కీర్తించి లేపటానికి ప్రయత్నము చేయడము మొదలు పెడతారు.








%20krishna.jpg)





