మొదటి ఐదు పాశురములలో గోదాదేవి తిరుప్పావై వ్రతము యొక్క నియమాలను, ఫలితములను తెలియ జెప్పింది. ఆ పిమ్మట 6 నుండి 15 పాశురముల వరకు ఒక్కొక్క దానిలోను ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వస్తుంది. ఆ విధముగా మొత్తం 10 మందిని లేపి తనతో బాటు స్నానము చేసి వ్రతము ఆరంభిస్తుంది.
ప్రతీ బాలికకి తెల్లవారినదను సూచనలు తెలియజేస్తూ లేపుతోంది. ఇప్పుడు ఆరవ పాశురములో ఏం చెప్పి లేపుతోందో చూద్దాము.
తిరుప్పావై - పాశురము - 06 - "పుళ్ళుమ్ శిలంబిన కాణ్"
పుళ్ళుమ్ శిలంబిన కాణ్, పుళ్లఱైయన్ కోయిలిల్
వెళ్లై విళి శంగిన్ పేరఱవుమ్ కేట్టిలైయో ?
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్, పేయ్ ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కజియ క్కాలోచ్చి
వెళ్ళ త్తరవిల్ తుయిల్ మఱంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్ గళుమ్, యోగిగళుమ్
మెళ్ళవెళుందు అఱి ఎన్ఱ పేరరవుమ్
ఉళ్ళం పుగుందు కుళిరిన్దేలో రెమ్బావాయ్ ||
అర్థము:
పక్షులు కిలకిలారవములతో అంతటా ఎగురుతున్నాయి. పక్షుల రాజగు గరుత్మంతుని ప్రభువు గుడిలో స్వఛ్చముగా ఆహ్వానములు పలుకుతూ గట్టిగా ధ్వని చేయబడుతున్న శంఖారావము నీకు వినబడుట లేదా?
ఓ పిల్లా, లేచి రావమ్మా! పూతన యొక్క విశాల, విషపూరిత స్తనముల నుండి జుర్రుకుంటూ ఆమె రక్తమునంతా పీల్చేసి, మరియు మాయల మారి శకట రూపములో నున్న శకటాసురుని కీళ్లూడిపోయేలా తన కాలితో తన్ని చంపిన వాడును, పాలకడలిలో ఆదిశేషునిపై యోగనిద్రలో పరుండి ఉన్నవాడునూ అయినా ఆ శ్రీమన్నారాయణునికి శ్రమ కలుగకుండ తమ మనస్సులలోనే మెల్లగా "హరి హరి" అని ధ్యానించుకుంటూ వెళ్తున్న లోకములోని మునులు, యోగులూ చేస్తున్న ధ్యానమంతా కూడ ఒక చిరుగాలి రూపములో మా మనస్సులకు తగిలి మాకు వెలువ వచ్చింది.
ఈ విధముగా మేలుకుని మేమంతా కూడ వ్రతము కోసమని బయలు దేరాము. అలా మేము చిరుగాలి ధ్వనికే లేచి వచ్చాము. మరి మేమంతా పిలుస్తున్నా రాకపోతే ఎలా? త్వరగా లేచి బయలు దేరుము.
గోదాదేవి పదిమంది గోపికలను లేపుతూ 10 పాశురాలు అల్లింది. కాని తను ముందుగానే ఇంకో ఒకరిద్దరితో కలిసి బయలు దేరింది అని మనము తెలుసుకోవాలి.
%20krishna.jpg)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి