"ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి"
తిరుప్పావై మూడవ పాశురములో గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము ఆచరిస్తే కలిగే లాభము, ఫలితములను వివరిస్తోంది. ప్రపంచమంతటా కూడా వర్షములు పడి పంటచేలతోను, పశు సంపదతోను, ఐశ్వర్యముతోను అందరూ సుఖంగా ఉంటారని చెబుతోంది.
తిరుప్పావై - పాశురము 03
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు శాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయిదు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగు వళై ప్పోదిల్ ప్పొఱివణ్ణు కణ్ పడుప్ప
త్తెంగా దే పుక్కిరందు శీత్తములై పత్తి
వాంగ క్కుడం నిరైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వమ్ నిరైందే లో రెమ్బావాయ్ ||
అర్థము:
పెద్దగా పెరిగి ప్రపంచాన్ని కొలిచిన ఆ ఉత్తముడైన పరమాత్మను పొగడుతూ కీర్తించి, మనము దృఢమైన భక్తి విశ్వాసములతో ఈ వ్రతాన్ని పాటిస్తే:
ఈ ప్రపంచమంతటా కూడ ఎటువంటి ఇబ్బంది కలుగని విధముగా నెలకు మూడు వర్షములు కురియును. పంట చేలు ఏపుగా పెరిగి నాట్యము చేస్తాయి.
ఆ చేల మధ్యలందునూ, నీటి కాలువ లందునూ చేపలు ఎగిరెగిరి గంతులు వేస్తూండును. తుమ్మెదలు అందామైన రెక్కలతో అంతటా విహరిస్తూ తేనెలు తాగి మత్తులో మునుగుతూంటాయి.
బాగా బలిష్టమైన పశువులు పెద్ద పెద్ద బిందెల నిండా పాలు నింపేస్తూంటాయి.
ఈ విధంగా అంతటా సుభిక్షం, ఐశ్వర్యములతో మునిగి తేలుతుంటారు అంతా.
కాబట్టి పదండి ఈ వ్రతము చేద్దాము.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి