ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము అన్నది రామాయణము నందు సుందరాకాండ ముగింపు ఘట్టములో ప్రస్తావించబడినది. దీన్ని సీతాదేవి ప్రస్తావించింది.
ఆంజనేయుడు రాముని ఆజ్ఞ మేరకు సీతాదేవి కోసమని వెదుకుతూ, సముద్రము దాటి లంకకు వెళ్ళాడు. లంక అంతటా గాలించి, ఆ ప్రయత్నములో అనేక మంది రాక్షసులను హతమార్చి, అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి జేరుకుంటాడు.
ఆమెకు నమ్మకము కలిగించడానికి రాముని యొక్క గుణగానము, అతని అవయవ సౌష్టవము సీతాదేవికి వల్లెవేస్తాడు. ఆ విధముగా సీతాదేవి పెట్టిన పరీక్షలు అన్నింట్లో ఉత్తీర్ణుడై, ఆమెకు నమ్మకము కలిగిస్తాడు. రాముని క్షేమము చెప్పి, ముద్రికను చూపించి, త్వరలోనే మేమందరము వచ్చి నిన్ను విడిపించుకుని తీసుకెళ్తామని ఓదార్చి, తిరుగు ప్రయాణము కట్టే ముందు, కాస్త రావణాసురుడి ఆట పట్టించి వెళ్తానని చెప్పి ఆవిడ ఆజ్ఞ పొందుతాడు.
అశోకవనము అంతా చిందరవందర చేసేసి, రాక్షసుల చేతిలో బంధింపబడినట్లుగా నాటకమాడి, రావణాసురుడి దగ్గరకు జేరుతాడు. అతనికి శిక్షగా తోకకు నిప్పంటించి లంకా నగరమంతా తిప్పుతుంటే అన్ని రహస్యాలు ఆరా తీస్తూ ఆనందంగా తిరుగుతాడు. ఆ తర్వాత ఒక్కసారిగా బంధము విడిపించుకుని పైకి ఎగిరి తన తోకకి ఉన్న మంటలతో భవనాలన్నీ కూలిపోయేలా మంటలు అంటించి, సముద్రపు నీటిలో మునిగి మంటని ఆర్పేసుకుని, భయపడుతూ మళ్ళీ సీతాదేవి దర్శనము చేసుకుని, ఆవిడ క్షేయంగానే ఉందని సాంత్వన చెందుతాడు.
అప్పుడు సీతాదేవి అతని ఘనకార్యములన్నిటినీ తిలకించింది కనుక ధైర్యము చెంది, తనను తప్పకుండా అతని సాయముతో శ్రీరాముడు విడిపించుకుంటాడని నమ్మకము పొందుతుంది. ఈ సందర్భము లోనే సీతాదేవి ఈ కార్యసాధన మంత్రమును ప్రస్తావించింది.
ఆంజనేయా నీవు అన్నింటికీ సమర్ధుడివే అని అంటుంది. ఇదే మాటను ఈ క్రింది శ్లోకములో అంటుంది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి